Friday 26 April 2024
విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌ. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు
02-3-2024 నాడు విజయనగరంపట్టణంలో విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గౌ.
Tuesday 02 April 2024
కొణతాలకు మద్దతు తెలిపిన శిష్టకరణ తెలుగు దేశం సాధికార సమితి సంఘ నాయకులు...
జనసేన,తెలుగుదేశం, బిజెపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గారిని అనకాపల్లి లోని పార్టీ కార్యాలయంలో స్టేట్ తెలుగు దేశం శిష్ట కరణ సాధికార సమితి నాయకులు శ్రీ అక్కు మహంతి రాజా గారు, అనకాపల్లి జిల్లా కన్వీనర్జక్కువ వెంకట గోపీనాథ రావు పట్నాయక్ , గారు మరియు సంఘం నాయకులు కలసి మద్దతు తెలియజేసారు , రామకృష్ణ గారికి రాబోయే ఎన్నికల్లో విజయానికి కృషి చేస్తామని తెలిపారు
ఆక్వా కల్చర్ పై యువతకు శిక్షణా కార్యక్రమం
ఆక్వా కల్చర్ పై యువతకు శిక్షణా కార్యక్రమం ప్రారంభం చోడవరం ( ప్రెస్ నోట్ ) 18 03 2024
అంతర్జాతీయ జలదినోత్సవం
22-3-2024 నాడు అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఇండియన్ సొసైటీ ఫర్ కల్చరల్ కోపరేషన్ అండ్ ఫ్రెండ్ షిప్ (ISCUF) సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం పట్టణంలో జీవియమ్ సి గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణసంఘం అధ్యక్షులు శ్రీ పోలుమహంతి ఉమామహేశ్వరరావు గారు పాల్గొని నీటియొక్క ఆవశ్యకత, జనసాంద్రత ఎక్కువవడంవలన భూమిలో నీటిశాతం తగ్గి భవిష్యత్తులో మానవమనుగడకు పెనుముప్పు వచ్చేవిధంగా ఉందని ,ఇప్పటినుండే నీటిని పొదుపుగా వాడి, ప్రతీ జీవికీ అత్యవసరమైన నీటి పరిరక్షణకు స్వచ్ఛందసంస్థలంతా నడుంకట్టాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిసి కులాల సమాఖ్య సంక్షేమసంఘం విశాఖపట్నంజిల్లా సెక్రటరీగా నియమితులైన శ్రీ పొట్నూరు నరసింహమూర్తి పట్నాయక్ గారు
విశాఖపట్నం వాస్తవ్యులు, ఆలిండియా శిష్టకరణసంఘం కార్యవర్గసభ్యులు, విశాఖపట్నంజిల్లా శిష్టకరణసంఘం ఉపాధ్యక్షులు, విశాఖశిష్టకరణసంఘం-కంచరపాలెం ఉపాధ్యక్షులయిన శ్రీ పొట్నూరు నరసింహమూర్తి పట్నాయక్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి సి కులాల సమాఖ్య సంక్షేమసంఘం (రి.నెం 381/2015) విశాఖపట్నంజిల్లా సెక్రటరీగా 7-1-2024 నాడు నియమితులైనందుకు అభినందనలు తెలియజేద్దాం.
రక్తదాన శిబిరం
మదర్ తెరిసా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ మరియు మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ సంయుక్తంగా, అయ్యన్నపేట జంక్షన్ లో ఉన్న "మదర్ తెరిసా కిడ్స్ స్కూల్ లో" విజయనగరం "ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ" వారి సౌజన్యంతో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
"మదర్ తెరిసా కిడ్స్ స్కూల్లో", "అంతర్జాతీయ మహిళా దినోత్సవ" వేడుకలు"
విజయనగరం పట్టణంలో, అయ్యన్నపేట జంక్షన్లో ఉన్న, మదర్ తెరిసా సేవా సంఘం ఆర్గనైజేషన్ వారు "మదర్ తెరిసా కిడ్స్ స్కూల్లో", "అంతర్జాతీయ మహిళా దినోత్సవ" వేడుకలను "కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ & సేవా సంఘం అధ్యక్షులు-, త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
హిరమండలం శిష్టకరణ సంఘం ప్రధాన కార్యదర్శి కరకవలస గణేష్ మాస్టారు గారి గృహ ప్రవేశం
ఆదివారం 3-3-2024: హిరమండలం శిష్ట కరణ సంఘం ప్రధాన కార్యదర్శి కరకవలస గణేష్ మాస్టారు గారి గృహ ప్రవేశం సందర్భంగా...
మహిళ దినోత్సవ వేడుకల్లో కీర్తిపట్నాయక్ చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ఘనంగా సన్మానం
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగ విశాఖపట్నంలో గల పబ్లిక్ లైబ్రరీ లో రాష్ట్ర బిసిల ఆసోసియేషన్ ప్రజా సంఘాల ప్రెసిడెంట్ ఏర్పాటు చేసిన మహిళ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బిసిల తరుపున కీర్తిపట్నాయక్ చేస్తున్న సేవాకార్యక్రమాలకు గాను ఘనంగా సన్మానం చేశారు.
Sunday 31 March 2024
"మహిళాసాధికారత" చట్టాలు గూర్చి విద్యార్థులు మరియు గ్రామస్థులకు వివరిస్తున్న నోటరీ & న్యాయవాది శ్రీ చంద్రశేఖర పట్నాయక్
టెక్కలి మండలం, చిన్న నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన NSS శిబిరంలో విద్యార్థులు మరియు గ్రామస్థులకు "మహిళాసాధికారత" చట్టాలు గూర్చి ఉదాహరణలతో వివరిస్తున్న నోటరీ & న్యాయవాది శ్రీ చంద్రశేఖర పట్నాయక్, టెక్కలి, call: 9441029877