శిష్టకరణం యువత సభ్యులుగా ఉండండి. జనగణనను పూర్తి చేయండి...
కులాభిమానులకు సంఘ సేవకులకు ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలవడానికి, సేవలందించడానికి వయసుతో సంబంధం లేకుండా సేవే పరమావధిగా తలచిన ప్రతి ఒక్కరికి మన రాష్ట్ర మొత్తం మీద ప్రతి ప్రాంతానికి ప్రతినిధులుగా ఉండడానికి, మన కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతున్నాము శిష్టకరణం యువత సభ్యులుగా ఉండండి........జనగణనను పూర్తి చేయండి...........సభ్యులుగా చేరండి కులానికి సేవ చేయండి
[Submitted by Bharath Vikas]
కుల జనగణన
శిష్టకరణం కుటుంబ సభ్యులకు మనవి మనకి సుమారు 650 ఇంటి పేర్లు ఉన్నవి ఈ లెక్క ప్రకారం మన దాదాపు మూడు లక్షల మంది పైనే జనాభా కలిగి ఉంటాము కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 69 వేల మంది అని చెప్పడం జరిగింది కుల జనగణన అనే పేరుతో మన కుటుంబీకులు వివరాలను ఒక సంవత్సర కాలంగా సేకరిస్తూ ఇప్పటికి 23 వేల మంది సభ్యుల వివరాలను మేము సేకరించాము ఇంకా మన పూర్తి వివరాలు తెలియాలి గనుక మన దేశం లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ జన గణ లో పాల్గొని మీ వివరాలను అప్డేట్ చెయ్యండి ఈ కింద ఇచ్చిన గూగుల్ ఫారం లింకును క్లిక్ చేసి మీ వివరాలను పొందుపరచండి మన కుల అభ్యున్నతికి పాటుపడండి.
https://forms.gle/vku2J4irc4pLh7ay6
ఇట్లు సదా మీ సేవలో శిష్టకరణం కుల అభిమాని
మానాపురం సురేష్ కుమార్ శిష్టకరణం యువత బృందం
[Submitted by Bharath Vikas]
విజయనగరం జిల్లా నూతనంగా ఎన్నికైన యువత టీమ్
విజయనగరం జిల్లా నూతనంగా ఎన్నికైన యువత టీమ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి టీమ్ ను ఎన్నుకొన్న యువత అధ్యక్షుడు శ్రీ మనాపురము సురేష్ గార్కి అభినందనలు అందులో మంచికి మారుపేరు స్వయానా నా మేనల్లుడు అన్నజిరావునీ ఎన్నిక చేసిన సురేష్ గారు మీకు మరియొక సారి నా ప్రత్యేక ధన్యవాదములు అలాగే ఎవరు చేయని మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీకు దేవుడు దీర్ఘాయుష్షు మీకు ఇవ్వాలని మీ ద్వారా మంచి మంచి కార్యక్రమాలను చేయించాలని మనస్పూర్తిగా కోరుకుంటూయున్నాను.
[Submitted by Bharath Vikas]
సాహితీ పరంపర వేడుకలు
శిష్టకరణ యువత శ్రీ మాణాపురం సురేష్ బాబు బృందం ఏర్పాటు చేసిన సాహితీ పరంపర వేడుకలు నాకు ఆహ్వానం పలికారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యిన డిప్యూటీ మేయర్ శ్రీ జియ్యాని శ్రీధర్ గారు , బెహరా, చైతన్య బాబు, రమాకాంత్ గారు ,రవిశంకర్ గారు, సన్ మూర్తి గారు, బలివాడ హరిబాబు గారు, కీర్తి పట్నాయక్, తిలక్ గారు, కోరియోగ్రఫీ శ్రీ నాగారాజు పట్నాయక్ గారు ఆధ్వర్యంలో , చిన్నారులు, రఘుపాతృని టీనా, ధరణి. వీరితో పాటు మరో కొంతమంది నాట్యం ప్రదర్శన అన్ని భాషలు పాటలతో ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇంత మంచి కార్యక్రమం కి నన్ను ఆహ్వానించునందుకు తమ్ముడు మానాపురము సురేష్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి చిన్నవయస్సులోనే శిష్ట కరణ యువత అనే సంస్థ పెట్టీ దానికి అధ్యక్షులుగా ఉంటూ మంచి టీమ్ ను ఎన్నుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అతను ప్రతి కార్యక్రమము అందరి పెద్దల సహకారంతో, వారి ఆశీస్సులతో దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ సురేష్ గార్కి ప్రత్యేక అభినందనలు. గౌరవనీయులైన రవిశంకర్ గారు, రమాకాంత్ గారు ,పావని గారు హరిబాబు గారు, సన్ మూర్తి గారు అక్కడకు వచ్చిన ప్రముఖుల అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నిజంగా చాలా రోజుల తర్వాత ఇంత చక్కని కార్యక్రమం జయప్రదంగా జరిగింది. ఇంతటి మంచి కార్యక్రమములో నాకు అవకాశం కల్పించిన సురేష్ బాబు కి నా ధన్యవాదములు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మన కులపెద్ద లను సమైక్య పరిచి వారి సమక్షంలో దిగ్విజయంగా చేయాలని మనసారా తమ్ముడు సురేష్ బాబుకి ఆశ్వీరదిస్తు దేవుడు చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను.
బాసూరి శ్రీనివాసరావు, విశాఖ శిష్ట కరణ సేవా సంఘం కంచర పాలెం ఆర్గనైజింగ్ సెక్రటరీ..
[Submitted by Bharat Vikas]
సాహితీ పరంపర బహుమతి ప్రధానోత్సవం
శిష్టకరణం యువత వెల్ఫేర్ సొసైటీ, ఆంధ్ర ప్రదేశ్. పేరున ఏర్పాటై సంవత్సరం అయినందున వార్షికోత్సవ0 లో భాగంగా, ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర నలుమూలల లో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు మహిళలకు ఆన్లైన్ లోనే వివిధ సాంస్కృతిక, సాహిత్య పోటీలు నిర్వహించాయి.దాదాపు 750 మంది విద్యార్థులు మరియు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తాము వేసిన డ్రాయింగ్ లను, క్రాఫ్ట్ వర్క్ ను మెహందీ డిజైన్, సాంప్రదాయ వస్త్ర అలంకరణ, వంటా-వార్పు ,ఫ్యాన్సీ డ్రస్, పాటలు మరియు నృత్యాలు మొదలైన పోటీలలో పాల్గొని తమ ఎంట్రీలను వాట్సప్ ద్వారా శిష్టకరణం యువత కమిటీకి అందజేశారు.
దీనికి సాహితీ సాహిత్య పరంపర అని నామకరణం చేసి ఒక వారం రోజులు పాటు నిర్వహించారు.ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా శ్రీ మానాపురం మహాలక్ష్మి గారు శ్రీ బలివాడ హరిబాబు గారుశ్రీ శేఖర మంత్రి మోహన్ పట్నాయక్ గారుశ్రీ బగ్గా0 సుధాకర్ గారు శ్రీ సన్ మూర్తి గారు న్యాయనిర్ణేతలుగా ఉండి ఎటువంటి ప్రలోభాలు లేకుండా చక్కని జడ్జిమెంట్లు ఇచ్చారు.
అదేవిధంగా ఆగస్టు 20వ తేదీన జరిగిన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రతి శిష్టకరణం కుటుంబం తన ఇంట్లో నిర్వహించిన పూజ మండపాన్ని ఫోటో తీసి శిష్టకరణం బృందం కమిటీకి వాట్సాప్ చేశారు.అన్ని జిల్లాల నుండి మహిళలు ఉత్సాహంగా పాల్గొని పండుగ వాతావరణాన్ని కలిగించారు. అందులో ముగ్గురికి చీర మరియు గాజులు బహుమతిగా అందజేయడం జరిగింది.అదేవిధంగా బహుమతి ప్రధానోత్సవం రోజు అనగా ఆగస్టు 22వ తేదీ అదృష్టవశాత్తు రాఖీ పండుగ.
ఆరోజు రాఖీ పండుగ లో రాఖీలు కట్టుకున్న.. అన్నా చెల్లెలు, అక్కాతమ్ముళ్ల కు బహుమతి ప్రధానోత్సవం చేశారు.
ఈ సాహితీ పరంపర బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఆగస్టు 22వ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి7 గంటలవరకు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ నగర డిప్యూటీ మేయర్ శ్రీ జియాని శ్రీధర్ గారు మరియు బెహరా విద్యాసంస్థల అధిపతి శ్రీ బెహరా విజయ చైతన్య గారు విచ్చేసి పిల్లలకు, మహిళలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో రఘుపాత్రుని నాగరాజు పట్నాయక్ గారి శిక్షణలో అంతర్జాతీయ జానపద నాట్య లను ప్రపంచ నలుమూలల ప్రదర్శనలిచ్చిన హర్షిత టీనా మరియు ధరణి అనే చిన్నారులు బృందం అద్భుతమైన తమ నటనా కౌశలంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.ఈ కార్యక్రమం అనంతరం కుమారి హర్షిత టీనా కు మరియు ధరణికి డిప్యూటీ మేయర్ మరియు బెహరా విజయ చైతన్య గారి చేతుల మీదుగా సన్మానం చేసి ఆ శిష్టకరణం చిన్నారులకు బహుమతి అందజేశారు.
గౌరవనీయులు బెహరా విజయ చైతన్య గారికి శిష్టకరణం యువత బృందం ఘనంగా సన్మానించింది.ఈ కార్యక్రమంలో శిష్టకరణం యువత గౌరవ అధ్యక్షులు శ్రీ శ్రీ సదాశివుని రమా శంకర్ గారు, న్యాయసలహాదారు మానాపురం తిలక్ పట్నాయక్ గారు, శ్రీ సన్ మూర్తి గారు శ్రీ బలివాడ హరిబాబు గారు, శ్రీమతి కూరాడ పావని గారు, శ్రీమతి కుప్పిలి కీర్తి పట్నాయక్ గారు, శ్రీ రఘు పాత్రుని నాగరాజు పట్నాయక్ గారు,శ్రీ ఉరిటి సిద్ధార్థ పట్నాయక్,శ్రీ శేఖరమంత్రి సురేష్ ,శ్రీ బెహరా కాళీ ప్రసాద్,శ్రీ మానాపురం సురేంద్ర, విజయవాడ వాస్తవ్యులు శ్రీమతి కె సరితా పట్నాయక్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్య క్రమాన్ని ఇంత వేడుకగా నిర్వహించిన శిష్టకరణం యువతను పలువురు అభినందించారు.
Essential commodities to 100 people ... 100 మంది కి నిత్యావసర సరుకులు పంపిణీ
With a purpose of bringing all Sistakranam community members together in 13 districts of Andhra Pradesh, connecting all the associations, Sistakaranam Yuvata is collecting donations for the purpose of providing assistance to their peers working in private colleges and schools, who are facing difficult times going through the corona pandemic, said Manapuram Suresh Kumar and Venum VeeraBabu, representatives of the youth association.
As part of this programme, distribution of essential commodities has been done to 30 people in Srikakulam, 30 in Vizianagaram and 40 in Visakhapatnam whose salaries have stopped being employed in private colleges and schools, they said.
ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో ఉన్న శిష్టకరణం కులస్తులు అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి, సంఘాలను అన్నిటినీ కలుపుకుంటూ వారి సహకారంతో ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో ఉద్యోగం చేస్తూ కరోనా మహమ్మారి దెబ్బకు జీతాలు లేక జీవితాన్ని దుర్భరంగా వెళ్లదీస్తున్న తోటి వారికి సహాయం అందించే ఉద్దేశ్యంతో విరాళాలు సేకరిస్తూ ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు శిష్ట కరణం యువత అని సంస్థ ప్రతినిధులు మానాపూరం సురేష్ కుమార్, వేణు, వీరబాబు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం లో 30 మందికి, విజయనగరం లో 30 మందికి, విశాఖపట్నంలో 40 మందికి మొదటి విడతగా ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో ఉద్యోగం చేస్తూ జీతాలు లేక బాధపడుతున్న మనవారికి నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నాము అని తెలియచేశారు. |
[Submitted by Bharat Vikas]
State Level Meet held ... ఘనంగా శిష్టకరణాల సమ్మేళనం
A state level sistakaranam meeting was held on Sunday at the SSR Function Hall near Vepagunta Old Goshala. YRSCP Visakhapatnam Parliamentary Constituency in-charge Behara Bhaskara Rao was the chief guest at the function, which was presided over by Manapuram Suresh Kumar, president of the State Level Youth Association. A call was given to everyone to work hard for OBC achievement. Sistakaranam Corporation Director Sadashivuni Krishna, Pendurthi Mandal Association members Dabbir Venkata Rao, Baliwada Sathya Rao and BRM Patro participated.
వేపగుంట దరి పాత గోశాల సమీపంలోగల ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో శిష్టకరణ ముల రాష్ట్రస్థాయి సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది . రాష్ట్రస్థాయి శిష్టకరణ యువత సంఘం అధ్యక్షులు మానా పురం సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ ఛార్జి బెహరా భాస్కరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఓబీసీ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు . శిష్ట కరణ కార్పొరేషన్ డైరెక్టరు సదాశివుని కృష్ణ , పెందుర్తి మండలం అసోసియేషన్ సభ్యులు డబ్బీరు వెంకటరావు , బలివాడ సత్యారావు , బీఆర్ఎం పాత్రో పాల్గొన్నారు.
SK Yivatha appoints State Level Executive Team
The appointment of the new state level executive of the Sistakaranam Yuvata, Andhra Pradesh was recently concluded. Manapuram Suresh Kumar, who was appointed president, has revealed the names of the executive members in a statement.
State Level Executive
President: Manapuram Suresh Kumar. (Visakhapatnam)
Vice President: Venum Veerababu. (Rampa Chodavaram)
Secretary: Raja Mahanti Bhanuchandar (Srikakulam)
Assistant Secretary: Raghupathruni Srinivasa Rao (Ichhapuram)
Treasurer: Patnaikuni Mohan Rao. (Nelimarla)
Organizing Secretary: Behera Rajesh. (Kottabomali)
EC MEMBERS
Avilala Sridhar (Chittoor District President)
Karanam Niranjan (Chittoor District Secretary)
Karanam Edukondalu (Nellore District President)
Karanam Rajesh (Nellore District Secretary)
Dalai SVR Suresh. (Kakinada in charge)
Dabbir Shiva Kishore Patnaik. (Visakhapatnam Coordinator)
Sadashivuni Nooka Raju (Chodavaram in charge)
Nidaganti Sunil Babu (Ramabhadrapuram in charge)
Eluri Ramesh. (Krishna District In-charge)
Nallada Ramakrishna (Pithapuram in charge)